హైదరాబాద్లో చారిత్రక కట్టడం ప్రారంభంకానుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిను శనివారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నన్నారు. రూ.184 కోట్ల వ్యయంతో జర్మన్ మేడ్ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి భారత దేశంలోనే అతి పెద్దది. మరో బ్రిడ్జి గుజరాత్ లోని నరాంద నదిపై నిర్మించారు. అయితే ఆ బ్రిడ్జి కంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నాలుగు రెట్లు పెద్దది. 2017 ఏప్రిల్ 26న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా శంకుస్థాపన జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 18 నెలలలో పూర్తి చేయాలని లక్షంగా నిర్దేశించుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అత్యాధునికి టెక్నాలజీతో 8 దేశాలకు చెందిన ఇంజినీరుల సహాయ సహకారాలతో ఎల్ అండ్ టి సంస్థ బ్రిడ్జిను నిర్మాణాన్ని 22 నెలల కాలంలో పూర్తి చేసింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికు అత్యాధునికి లైటింగ్ మరో ప్రత్యేకతగా నిలవనుంది.