ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భాగ్యనగర వాసులకు అందుబాటులో మరో కనువిందు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 06:53 PM

హైదరాబాద్లో చారిత్రక కట్టడం ప్రారంభంకానుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిను శనివారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నన్నారు. రూ.184 కోట్ల వ్యయంతో జర్మన్ మేడ్ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి భారత దేశంలోనే అతి పెద్దది. మరో బ్రిడ్జి గుజరాత్ లోని నరాంద నదిపై నిర్మించారు. అయితే ఆ బ్రిడ్జి కంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నాలుగు రెట్లు పెద్దది. 2017 ఏప్రిల్ 26న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా శంకుస్థాపన జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 18 నెలలలో పూర్తి చేయాలని లక్షంగా నిర్దేశించుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అత్యాధునికి టెక్నాలజీతో 8 దేశాలకు చెందిన ఇంజినీరుల సహాయ సహకారాలతో ఎల్ అండ్ టి సంస్థ బ్రిడ్జిను నిర్మాణాన్ని 22 నెలల కాలంలో పూర్తి చేసింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికు అత్యాధునికి లైటింగ్ మరో ప్రత్యేకతగా నిలవనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com