కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్థిరంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు 1, 54,954 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. అధికారులు 8 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి స్పీల్ వే ద్వారా అంతే ప్రవాహాన్ని దిగువ పులిచింతలకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు (312.04 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులు (309.15) టీఎంసీలుగా ఉంది.