అక్రమ లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 26న రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, న్యాయవాది గోపాల్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్టోబరు 14 లోగా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణ అక్టోబరు 15కి హైకోర్టు వాయిదా వేసింది.