కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం పిలుపు మేరకు రేపు జరిగే ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. జాతీయ స్థాయిలో ఇచ్చిన సమ్మెకు తెలంగాణ వ్యాప్తంగా మద్దతు తెలపాలన్నారు. ఎల్ఆర్ఎస్తో ప్రభుత్వం ప్రజలకు ఉన్న ఆస్తి హక్కును హరిస్తోందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా సోమవారం అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తామన్నారు.