ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య ...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 18, 2020, 05:49 PM

భాగ్యనగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. చందానగర్‌లోని ఓ భవనంపై నుంచి దూకి శ్రీవిద్య (27) ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. భర్త శబరీష్‌ వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య నిన్న భర్త శబరీష్‌తో గొడవపడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ఈ సంఘటనపై చందానగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. 6 నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరీష్‌తో కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్య వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com