నేటి నుంచి భారత్- శ్రీలంక సంయుక్త నౌకాదళ విన్యాసాలు జరుగనున్నాయి. ట్రింకోమలీలో స్లినెక్స్-20 పేరిట నేటి నుంచి మూడు రోజుల పాటు విన్యాసాలు జరుగనున్నాయి. సముద్ర క్షేత్రంలో పరస్పర సహకారం లక్ష్యంగా ఇరుదేశాల సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇంటర్ ఆపరేటబిలిటీ, పరస్పర అవగాహన లక్ష్యంగా, బహుముఖ సముద్ర కార్యకలాపాల కోసం ఉత్తమ పద్ధతుల లక్ష్యంగా విన్యాసాలు ఉండనున్నాయి. దేశీయ యుద్ధ నౌకలు, విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయి. గన్ ఫైరింగ్, సీమన్షిప్, క్రాస్ డెక్ ఫ్లయింగ్, ఉపరితల, యాంటీ ఎయిర్ ప్రదర్శనలు ఇందులో భాగం కానున్నాయి.
శ్రీలంక నావికాదళానికి ఎస్ఎల్ఎన్ షిప్స్ సయూరా ( ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్), శ్రీలంక నావికాదళ కమాండింగ్ నావల్ ఫ్లీట్ కమాండింగ్ రేర్ అడ్మిరల్ బండారా జయతిలకా నేతృత్వంలోని గజబాహు (ట్రైనింగ్ షిప్) పాల్గొననున్నాయి. ఈస్టర్న్ ఫ్లాగ్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్ భారత నావికాదళానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇండియన్ నేవీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్), చేతక్ హెలికాప్టర్ ఆన్బోర్డ్ ఐఎన్ షిప్లు, డోర్నియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ భారత్ తరఫున పాల్గొంటాయని రక్షణవర్గాలు తెలిపాయి.