భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించే దిశగా భారీ విరాళాలు అందుతున్నాయి. వరదలతో కుదేలైన నగరజీవులను ఆదుకునేందుకు దాతలు విరివిగా స్పందిస్తున్నారు. తాజాగా, ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో డ్రగ్స్ భారీ విరాళం ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర సర్కారు చేపడుతున్న సహాయ చర్యల కోసం తమ వంతుగా హెటెరో యాజమాన్యం రూ.10 కోట్ల విరాళం అందించాలని హెటెరో నిర్ణయించింది. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని హెటెరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి వెల్లడించారు.