ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 05:27 PM

కోవిడ్ తర్వాత ప్రారంభమైన రైళ్లకు అదనంగా దసరా నేపథ్యంలో 196 జతల ప్రత్యేక రైళ్లను రైల్వే ప్రకటించిందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు. గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే నుంచి 42 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయన్నారు. ఈ నెల 20 - నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయన్నారు. దీనిలో జనరల్ కేటగిరి ఉండవని ఇవి ప్రత్యేక రైళ్లు కాబట్టి రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని రాకేష్ వెల్లడించారు. ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైందన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇక్కడి నుంచి కూడా ప్రారంభమవుతాయన్నారు. రద్దీ ఉన్న రూట్లలో సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారన్నారు. కోవిడ్ నిబంధనల మేరకే రైల్వే ప్రయాణికులు నడుచుకోవాలని రాకేష్ సూచించారు. మాస్కు తప్పని సరిగా ధరించాలి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ముందు ధర్మ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుందన్నారు. ఇవి ప్రత్యేక రైళ్లు కాబట్టి చార్జీలు కూడా అదనంగా ఉంటాయన్నారు. రైళ్లలో దుప్పట్లు, క్యాటరింగ్ ఫెసిలిటీ ఉండదని రాకేష్ పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com