రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(టీఎస్జీసీసీ) ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .పరిశ్రమల స్థాపనతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గిరిజన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూలు, శానిటైజర్ల తయారీతో బహిరంగ మార్కెట్లో జీసీసీ తనదైన ముద్ర వేసిందన్నారు.