ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి దశ ట్రయల్స్ లో ప్రతికూల ఘటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 22, 2020, 09:55 AM

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, కోవాగ్జిన్ పేరిట కరోనా టీకాను తయారు చేసి, ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్, తన ట్రయల్స్ లో ప్రతికూల ఘటన ఒకటి జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొంది. అయితే, ఈ ఘటన గురించి 24 గంటల్లోనే రిపోర్ట్ చేశామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ బయోటెక్ తొలి దశ టీకా ట్రయల్స్ లో జరిగిన ప్రతికూల ఘటన గురించి సంస్థ రిపోర్ట్ చేయలేదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


దీనిపై స్పందించిన భారత్ బయోటెక్, "ఆగస్టులో జరిగిన ఈ ఘటన గురించి సీడీఎస్సీఓ - డీజీసీఐకి 24 గంటల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చాము.అయితే ఇది వ్యాక్సిన్ కారణంగా జరుగలేదు" అని స్పష్టం చేసింది. ఈ టీకాను భారత్ బయోటెక్ తో పాటు ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కు ఇప్పటికే అనుమతులు లభించాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com