తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన ఓ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పద్మారావు తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్..పద్మారావు తనకు చిచ్చా అవుతాడని అభిమానంతో అలా అని ఉండొచ్చన్నారు. ఏదేమైనా కేటీఆర్ సమక్షంలోనే పద్మారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.