ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరణిలో కొత్త ఆప్షన్‌..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 21, 2021, 02:27 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారం కోసం తాజాగా ధరణిలో ‘అప్లికేషన్‌ ఫర్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌' పేరుతో కొత్త ఆప్షన్ ‌ను తీసుకొచ్చింది. వినియోగదారులు ‘యూజర్‌ లాగిన్‌' లోకి వెళ్ళాక.. డ్యాష్ ‌బోర్డులో ఈ ఆప్షన్ ‌ను ఎంచుకోవాలి. తర్వాత పేరు, అడ్రస్‌ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు చేయాలనుకున్న భూమి సర్వే నంబర్‌ ను నమోదు చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే సరిహద్దు వివాదం, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, ఇతర, పట్టాదార్‌ పాస్ ‌బుక్‌ (పీపీబీ)ల్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సమస్యకు సంబంధించిన వివరణను కింద బాక్స్‌ లో రాయాలి. చివరగా ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్‌ లోడ్‌ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్‌ లాగిన్‌ కు వెళ్తుంది. కలెక్టర్‌ వాటిని పరిశీలించి, అవసరమైతే విచారణ జరపాలని, వారంలో సమస్యను పరిష్కచాలని ప్రభుత్వం సూచించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com