తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారం కోసం తాజాగా ధరణిలో ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్' పేరుతో కొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. వినియోగదారులు ‘యూజర్ లాగిన్' లోకి వెళ్ళాక.. డ్యాష్ బోర్డులో ఈ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత పేరు, అడ్రస్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు చేయాలనుకున్న భూమి సర్వే నంబర్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే సరిహద్దు వివాదం, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, ఇతర, పట్టాదార్ పాస్ బుక్ (పీపీబీ)ల్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సమస్యకు సంబంధించిన వివరణను కింద బాక్స్ లో రాయాలి. చివరగా ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్ లోడ్ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్ కు వెళ్తుంది. కలెక్టర్ వాటిని పరిశీలించి, అవసరమైతే విచారణ జరపాలని, వారంలో సమస్యను పరిష్కచాలని ప్రభుత్వం సూచించింది.