గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్, మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.