ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుండే తరగతులు ప్రారంభం: మంత్రి సబితా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 23, 2021, 05:27 PM

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా కోవిడ్ -19 నిబంధనలను అనుసరించి ప్రారంభించుకోవాలని అన్నారు. కావున పాఠశాల యాజమాన్యం, సిబ్బంది అందుకు తగిన చర్యలు తీసుకుని, తరగతులు ప్రారంభించాలని సూచించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతులు తప్పనిసరి తీసుకోవాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com