ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ శాఖ గౌరవం పెరిగేలా పని చేయాలి : అదనపు ఎస్పీ నర్మద

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 08:44 PM

- - ప్రజా మన్ననలు పొందేలా పని చేయాలని సూచన
- - పదోన్నతులు పొందిన ఏ.ఎస్.ఐ.లకు దిశా నిర్దేశం చేసిన ఎస్పీ
- - విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలి 

నల్గొండ : పోలీస్ శాఖ గౌరవం ప్రజలలో మరింత పెంచే విధంగా పని చేయాలని అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద అన్నారు.
గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్స్ గా పనిచేస్తూ ఏ.ఎస్.ఐ.లుగా పదోన్నతులు పొందిన రవి ప్రసాద్, వేణు గోపాల్, శేఖర్, హనీఫ్, అంజయ్య, శ్రీనివాస్ రెడ్డిలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ప్రజలు మెచ్చుకునేలా పనితీరు ఉండాలని సూచించారు. ప్రజలే మనకు యజమానులనే విషయాన్ని గుర్తించుకొని ప్రజలతో మమేకం అవుతూ సమస్యలతో స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి బాధలు, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఏ ప్రాంతంలో పని చేసినా, ఏ బాధ్యతలతో ఉన్నా ప్రజాభిమానం పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని. అప్పుడే పోలీసుల గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు. పదోన్నతుల ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని, అదే సమయంలో సిబ్బందితో సమన్వయంతో పని చేస్తూ నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమర్ధవంతంగా పని చేయాలని చెప్పారు. మన పనితీరుతోనే పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం ముడిపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని ఆమె అభినందించారు.

కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి. జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com