- - 39 మందిని కోర్టులో హాజరు పరిచిన టూ టౌన్ పోలీసులు
- - పలువురికి జైలు, జరిమానా, రెండు నెలల లైసెన్స్ రద్దు
- - ప్రమాదాల నివారణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్సుల రద్దుతో పాటు జైలు శిక్ష తప్పదని నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు హెచ్చరించారు.
గురువారం 39 మందిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచగా వారిలో 17 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడగా పి. శంకర్ అనే వ్యక్తికి అయిదు రోజుల జైలు శిక్ష, జి. రాంబాబుకు మూడు రోజుల జైలు, స్వామి నారాయణ, కృష్ణమూర్తికి రెండు రోజుల జైలు, మల్లేష్, అల్లి సైదులుకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు చెప్పారు. మరో నలుగురు వ్యక్తులకు రెండు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరిగిందని వివరించారు.
ఈ పిట్టి కేసులలో 22 కేసులకు గాను 4,300 రూపాయలు జరిమానా విధించగా, 17 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 21,000 రూపాయల జరిమాన విధించడం జరిగిందని చెప్పారు. ఈ పిట్టి, మద్యం సేవించిన మొత్తం 31 కేసులకు గాను 25,300 రూపాయల జరిమాన విధించినట్లు ఎస్.ఐ. నర్సింహులు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ పరిక్షలతో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై, న్యూసెన్స్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని వివరించారు.