నగరంలోని థెరిస్సా మానసిక దివ్యాంగుల శిక్షణ కేంద్రాన్ని అడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ సందర్శించారు.
ధెరిస్సా మానసిక దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో వుండే 105 దివ్యాంగులు కోవిడ్ -19 నిబంధనల కారణంగా వారి ఇండ్ల వద్దనే వుంటున్న నేపథ్యంలో వారందరినీ పిలిచి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు సంస్థ సెక్రటరీ పరుచూరి వనజ కుమారి గారు ఏర్పాటు చేసిన ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యతిథిగా హజరైన అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ గారి చేతుల మీదుగా బియ్యం , కందిపప్పు , ఆయిల్ , షుగర్, టీ పొడి , హేర్ ఆయిల్ , షోపులో , పౌడర్ , చింత పండు , తాళ్ళిoపు గింజలు , ఉల్లిగడ్డలు , అరటి పండ్లు , స్నాక్స్ వంటి సరుకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ...
దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న మానసిక దివ్యాంగులను చేరదీసి మేము అండగా వుంటామని ముందుకు వచ్చి 1995 నుండి స్వచ్ఛందంగా ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వాహకులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎప్పుడైనా తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని ఈ సందర్భంగా అన్నారు . ఈ కార్యక్రమంలో సిఐ తుమ్మ గోపి, పరుచూరి నాగేశ్వరరావు , ప్రముఖ న్యాయవాది తొండపు వెంకటేశ్వరరావు , తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు .