ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థెరిస్సా మానసిక దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన అడిషనల్ డీసీపీ ఆడ్మీన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 09:06 PM

నగరంలోని థెరిస్సా మానసిక దివ్యాంగుల శిక్షణ కేంద్రాన్ని  అడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ సందర్శించారు. 


ధెరిస్సా మానసిక దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో వుండే 105  దివ్యాంగులు కోవిడ్ -19 నిబంధనల కారణంగా వారి ఇండ్ల వద్దనే వుంటున్న నేపథ్యంలో వారందరినీ పిలిచి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు సంస్థ సెక్రటరీ పరుచూరి వనజ కుమారి గారు ఏర్పాటు చేసిన ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి  ముఖ్యతిథిగా హజరైన అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ గారి చేతుల మీదుగా బియ్యం , కందిపప్పు , ఆయిల్ , షుగర్, టీ పొడి , హేర్ ఆయిల్‌ , షోపులో , పౌడర్ , చింత పండు , తాళ్ళిoపు గింజలు , ఉల్లిగడ్డలు , అరటి పండ్లు , స్నాక్స్ వంటి సరుకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ...


దుర్భరమైన జీవితాన్ని  కొనసాగిస్తున్న మానసిక దివ్యాంగులను చేరదీసి మేము అండగా వుంటామని ముందుకు వచ్చి 1995 నుండి  స్వచ్ఛందంగా ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వాహకులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎప్పుడైనా తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని ఈ సందర్భంగా అన్నారు .  ఈ కార్యక్రమంలో సిఐ తుమ్మ గోపి, పరుచూరి నాగేశ్వరరావు , ప్రముఖ న్యాయవాది  తొండపు వెంకటేశ్వరరావు , తన్నీరు  శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు .










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com