ఇంద్రవెల్లి మండలంలోని ధనోరా(బీ) గ్రామానికి చెందిన తుకారాం తాగిన మైకంలో బ్లేడ్తో భార్య గొంతుకోశాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన తుకారాం ఆరేండ్లుగా మండలంలోని ధనోరా(బీ) గ్రామంలో కుటుంబసమేతంగా ఉంటున్నాడు. తుకారాం, రాధాబాయి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మద్యానికి బానిసైన తుకారాం నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం మధ్యాహ్నం తాగిన మైకంలో ఇంటికి వచ్చిన తుకారామ్కు, భార్యకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బ్లేడ్తో భార్య రాధాబాయి గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన రాధాబాయిని జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు.