నాగార్జున సాగర్ ఉపఎన్నిక సమీపిస్తుండడంతో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ నెల 14న హాలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే సీఎం కేసీఆర్ సభపై హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశాయి బీసీ సంఘాలు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సభ ఏర్పాటు చేస్తున్నారని, తక్షణమే సభను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో హాలియా సభపై గందరగోళం నెలకొంది.