వాతావరణంలో మార్పుల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, నిర్మల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. 17 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ వెల్లడించింది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.