తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ ఆర్ధిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు, 25 కేజీల బియ్యాన్ని సాయంగా అందించాలని నిర్ణయించారు. ఆ సాయం కోసం ఇప్పటికే అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. నేరుగా జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఐతే ఇప్పటి వరకు 1.85 లక్షల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా అందాయి. గురువారం ఒక్కరోజే అప్లైకి సమయం ఉంది. రేషన్ కార్డు సంఖ్య లేకున్నా రేషన్ దుకాణం సంఖ్య తప్పనిసరిగా దరఖాస్తులో నమోదు చేయాలని అధికారులు తెలిపారు.