ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భిణికి కరోనా.. ఆపరేషన్ కు డాక్టర్ల నిరాకరణ...!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 12:06 PM

ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిబాలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని బీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఆమెకు సాధరణ ప్రసవం కాకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌ కు ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆ గర్భిణికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు వెనకంజవేస్తున్నారు. ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అంతదూరం తీసుకెళ్లడానికి వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రసవవేదన పడుతుంది. ఈ విషయంపై ఆసుపత్రి సూపరిండెంట్ మాట్లాడుతూ.. వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com