ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిబాలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని బీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఆమెకు సాధరణ ప్రసవం కాకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ కు ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆ గర్భిణికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు వెనకంజవేస్తున్నారు. ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అంతదూరం తీసుకెళ్లడానికి వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రసవవేదన పడుతుంది. ఈ విషయంపై ఆసుపత్రి సూపరిండెంట్ మాట్లాడుతూ.. వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.