నల్లగొండ: సీఎం కేసీఆర్పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. హాలియాలో గురువారం జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని సీఎం అంటుంటారని, కానీ తెలంగాణ ప్రజలనే చావుకు దగ్గర చేశారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని అనాథాశ్రమంగా మార్చారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలే కేసీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోపెట్టారని, కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.