తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, రేపటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండగా, 22 వరకు ఉపసంహరణకు తుది గడువు విధించారు. ఏప్రిల్ 30న పోలింగ్ జరుగనుంది. మే 3 న ఓట్ల లెక్కింపు జరుపనున్నారు. కాగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.