కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కరోనా టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు పంపిణీ ఆపేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని, అందుకే రెండో డోస్ తీసుకునే వాళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. పోర్టల్ లో సమస్య ఉందని, దాని కోసం కేంద్రాన్ని.. సాఫ్ట్ వేర్ లో మార్చాలని కోరామని ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో 3 లక్షల 74 వేల వాక్సిన్ నిల్వ మాత్రమే ఉందని, ప్రతి రోజు రెండున్నర లక్షల వాక్సిన్ కావాలని కేంద్రాన్ని కోరామని తెలిపింది. 18 నుంచి 45 మధ్య వయస్సు గల వాళ్ళు ఓపిక పట్టాలని.. రాబోయే మూడు, నాలుగు వారాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గొచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.