హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమీక్ష నిర్వహించారు. స్వల్ప జ్వరం గానీ, ఒంట్లో నలతగా గానీ ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా స్వల్ప జ్వరం ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గానీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో గానీ, బస్తీ దవాఖానాల్లో గానీ ప్రాథమిక జ్వర పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జ్వరమున్న వారికి ఉచితంగా కరోనా నివారణ మందుల కిట్ అందజేస్తున్నారని. ఈ మందులను 5 రోజుల పాటు వాడాలని పేర్కొన్నారు. నగరంలో పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో బల్దియా ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ విభాగాల ద్వారా హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్కై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.