ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 08:46 AM

 చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. బుధవారం వరకు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు.. గురవారం పెరుగలేదు. ఈ క్రమంలో వాహనదారులు కాస్త ఊపిరిపీల్చుకోగా.. శుక్రవారం మళ్లీ పైకి కదిలాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 34 పైసలు పెంచాయి. తాజా పెంపుతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.92.34, పెట్రోల్‌ రూ.82.95కు పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.93.36, డీజిల్‌, రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్‌ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్‌ రూ.85.45, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.95.97, డీజిల్ రూ.90.43‌, జైపూర్‌లో రూ.99.02, డీజిల్‌ రూ.91.80కి చేరాయి. ఇప్పటి వరకు ఈ నెలలో ఎనిమిది సార్లు పెట్రోల్‌ రేట్లు పెరిగాయి. పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. దేశ‌వ్యా‌ప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటింది. రోజు రోజుకు ఇంధన ధరలు పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com