హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నిరసన చేపట్టారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీతక్క ఆవేదన వ్యక్తం చేస్తూ అంబేడ్కర్కు వినతి పత్రం ఇచ్చారు. రోజు రోజుకు కరోనా తీవ్రంగా విజృభిస్తుందని, ఎక్కడ ఏ హాస్పిటల్ చూసిన కోవిడ్ పేషంట్స్తో నిండిపోతోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడం లేదని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేదల పరిస్థితేంటని సీతక్క ప్రశ్నించారు.