కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఇప్పటికే రాకపోకలను నిలిపివేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. లాక్ డౌన్ సడలింపు సమయంలోనూ వ్యక్తుల రాకపోకలను కూడా అనుమతించడంలేదు. దీంతో సరిహద్దులవద్ద 'నో ఎంట్రీ' విధానం కొనసాగుతోంది.