రెమ్డెసివియర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యాపేట పట్టణంలో రెమ్డెసివియర్ ఇంజక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతోటౌన్ సీఐ ఏ. ఆంజనేయులు పర్యవేక్షణలో ఎస్ఐలు నరేందర్ రెడ్డి, పి.శ్రీనివాస్, సిబ్బందతో కలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్పై దాడులు నిర్వహించారు. హాస్పిటల్ మేనేజర్, అతనితో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇంజక్షన్లను కృత్రిమ కొరత సృష్టించి వాటి డిమాండ్ ను బట్టి 30-35 వేల రూపాయల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వారివద్ద నుంచి 30 ఇంజక్షన్లు,సెల్ ఫోన్స్, బాలెనో కారును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.