ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవాళ ఈటల ప్రెస్ మీట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 18, 2021, 09:27 AM

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. హుజూరాబాద్‌కు వెళ్లి ఈ సందర్భంగా సన్నిహితులు, నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశంకానున్నారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించి తాజా పరిణామాలపై ఈటల గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు మాజీ మంత్రి ఈట రాజేందర్ భూ కబ్జా కేసు విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. జమున హెచరీస్ కంపెనీ నిర్మాణం కోసం 2018లో ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇంచార్జ్ తహసీల్దార్ సురేష్, మాలతి తెలిపారు. హకీంపేట 111 సర్వేనెంబర్‌లో అనుమతి లేకుండా షెడ్ల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ రెండుసార్లు నోటీసు ఇచ్చారని వారు తెలిపారు.


 


40 ఎకరాలలో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాల ప్రకారం విచారణ చేపడుతున్నామన్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అనుమతులు పొందినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని ఇంచార్జ్ తహశీల్దార్లు పేర్కొన్నారు. మరోవైపు మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్, విజిలెన్స్ అధికారులు మాసాయిపేటకు వచ్చారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com