దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి..తాజావారం తొలిరోజున లాభాలతో ముగించిన సూచీలు మలి సెషన్ లోనూ లాభాల బాటన సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి...బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 206, నిఫ్టీ 55 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి...ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 268 పాయింట్ల మేర ఎగసి 52,820 వద్దకు చేరగా... నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 15,887 వద్ద కదలాడుతున్నాయి... గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ దేశీ సూచీలు వరుసగా నాలుగో సెషన్ లోనూ లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి..