మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటెల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్ అలెర్ట్ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించాడు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటెల బృందం బయలుదేరింది. సోమవారం ఢిల్లీలో ఈటెల లాంఛనంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటెల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.