హన్మకొండ: ఆస్తుల రక్షణకే ఈటల రాజేందర్ భాజపాలో చేరినట్లు కనిపిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. కేసులకు భయపడే ఆయన చేరారన్నారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. ఈటల వామపక్ష సిద్ధాంతాలు ఏమయ్యాయని.. ఏం ఉద్ధరించడానికి భాజపాలో చేరారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై ఈటల వాడిన భాష సరిగా లేదన్నారు. రైతుబంధు కింద ఆయన రూ.26లక్షల లబ్ధి పొందారని.. ఇప్పుడు ఆ పథకం గురించి తప్పుగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తెలంగాణకు భాజపా ఏం చేసిందని కడియం శ్రీహరి నిలదీశారు.