వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న సీఎంకు.. మంత్రులు ఎర్రబెల్లిదయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మేయర్ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు
సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కాళోజీ ఆరోగ్య వర్సిటీ నూతన భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఐదెకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎక్సైజ్కాలనీలోని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో భోజనం చేయనున్నారు. ఆతర్వాత ఆర్ట్స్ కళాశాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు సీఎం వెళ్లనున్నారు.