భర్త కొట్టాడని అలిగి ఓ భార్య ఇంట్లో చెప్పకుండా అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ జి.శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.10సి గాయత్రిహిల్స్లో నివసించే సీహెచ్ ప్రసాద్ కుక్గా పనిచేస్తున్నాడు. 2018లో దివ్య (21) అనే యువతిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల పాటు వీరి సంసారం బాగానే సా గింది. గత ఏప్రిల్ 25వ తేదీన ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అదే నెల 30 వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. గత కొద్ది రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో గాలించినా భార్య ఆచూకీ తెలియకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య కోసం గాలింపు చేపట్టా రు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 7893044846 నంబర్లో సంప్రదించాలని కోరారు.