ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనం ప్రారంభించిన సీఎం కేసిఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 21, 2021, 04:15 PM

వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనాన్ని 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అంతకుముందు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అత్యాధునిక వసతులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com