తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలను అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఆరు అంబులెన్స్లను విరాళంగా ఇచ్చానన్న కేటీఆర్. తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు మొత్తంగా 90 అంబులెన్స్లను విరాళం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని కోరారు. అదే రోజున నిర్వహిస్తోన్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులు, అభిమానులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తన జన్మదినం రోజున బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం వృథాగా డబ్బు ఖర్చు చేయవద్దని కేటీఆర్ సూచించారు.