సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా ఫలహారం బండిల ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ఆ తర్వాత అమ్మవారి బోనాల జాతర, రంగం ఘట్టాన్ని ప్రశాంతంగా, గొప్పగా చాలా సంతోషంగా నిర్వహించుకున్నామన్నారు. ఇందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీకి, భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు అక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రతీ ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.