తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన రేషన్ పత్రాలను అందజేశారు. రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రేషన్కార్డులను అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ లో మంత్రి మల్లారెడ్డి నూతన రేషన్ పత్రాలను అందజేశారు. హైదరాబాద్ బేగంపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.