రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ డివిజన్ లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కాలంలో ప్రజల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50 కు పెంచారు. తాజాగా ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యం కోసం ప్లాట్ ఫాం ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తగ్గించిన ధరల ప్రకారం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 గా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే.. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.20 ఉంటుందని పేర్కొన్నారు.