ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పన పై రాష్ట్ర చీఫ్ సెక్రెటర సోమేష్ కుమార్తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చించారు.
రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వ తేదీతో బార్ల లైసెన్సుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021 – 22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి ప్రధానంగా సమీక్షించారు. వీటితోపాటు A4 వైన్ షాప్ల లైసెన్సుల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగిస్తున్న నేపథ్యంలో.. నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధి విధానాలను రూపొందించుటకై మంత్రి చర్చించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారు.