సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడైన రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే రాజు మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్ నగరంలోని పోతన కాలనీకి తరలించారు. అనంతరం స్థానికంగా ఉన్న స్మశానంలో బంధువులు అంత్యక్రియలను పూర్తి చేశారు.