ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిందితుడు రాజు మృతదేహాo పై ఆగ్రహంతో చెప్పులు విసిరిన స్థానికులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 16, 2021, 09:30 PM

సైదాబాద్‌ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు పల్లకొండ రాజు గురువారం ఉదయం నష్కల్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించగా, అతడి మృతదేహాన్ని పోలీసులు మధ్యాహ్నం ఎంజీఎం మార్చురీకి తరలించారు. రాజు మృతదేహం ఉన్న అంబులెన్సు మార్చురీ వద్దకు చేరుకుంటుండగా, కొందరు స్థానికులు ఆవేశంతో చెప్పులు విసిరారు. చిన్నారిని అమానుషంగా పొట్టనపెట్టుకున్న కిరాతకుడికి తగిన శిక్షే పడిందని శాపనార్థాలు పెట్టారు. అయితే వారిని సాయుధ పోలీసులు అడ్డుకొని శాంతపరిచారు. ఈ సందర్భంగా రాజు మృతదేహాన్ని భారీపోలీసు బందోబస్తు మధ్య మార్చురీ గదికి తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com