కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈరోజు నిర్మల్ సభకు రానున్నారు. ఆయన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి 9.40 గంటలకు బయలుదేరనున్నారు. 11.30 గంటలకు మహారాష్ట్ర నాందేడ్ ఎయిర్పోర్టుకు అమిత్షా చేరుకుంటారు. నాందేడ్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 1.50 గంటలకు నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిర్మల్కు బయలుదేరుతారు. 2.30 గంటలకు అమిత్షా నిర్మల్కు చేరుకొని 2.45 గంటలకు మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.15 నుంచి 4.50 గంటలవరకు నిర్మల్ సభలో పాల్గొంటారు.
ఇక సాయంత్రం 5గంటలకు అమిత్ షా హెలికాప్టర్లో నాందేడ్కు తిరిగి పయనమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7.30 గంటల వరకు ఢిల్లీకి చేరుకుంటారు.