ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మల్‌ లో అమిత్‌ షా పర్యటన సక్సెస్‌!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 09:18 PM

తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణలో భాగంగా శుక్రవారం నిర్మల్‌లో చేపట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభ సక్సెస్‌ అయ్యింది. సభకు భారీ ఎత్తున జనం తరలొచ్చి జేజేలు పలికారు. సుమారు 70వేల మంది వరకు సభకు తరలి రావడం.. ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిర్మల్‌ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలొచ్చారు. మరీ ముఖ్యంగా సభకు యువకులు అమిత్‌ షా సభకు రావడం గమనార్హం. దారి పొడగునా తమ బైకులకు, కార్లకు, ఆటో రిక్షాలకు బీజేపీ జెండాలను పెట్టుకొని.. నినాదాలు చేసుకుంటూ వారంతా సభకు తరలొచ్చారు. దీంతో నిర్మల్‌ పట్టణమంతా కాషాయవర్ణంతో నిండిపోయింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com