ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ కేసులో హాజరవుతున్న సెలబ్రిటీలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ : రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 10:20 PM

డ్రగ్స్ కేసులో హాజరవుతున్న సెలబ్రిటీలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్యర్యంలో సీఎం ఇలాకా గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్‌లో 60 వేల ఎకరాల భూమి తీసుకుని 14 గ్రామాలను ముంచారని కేసీఆర్‌పై ఆరోపణలు చేసారు. కొండపోచమ్మసాగర్‌లో తమ బంధువుల భూమిని కాపాడటం కోసం పేదల భూమిని లాక్కొన్నారన్నారు. అర శాతం జనాభా ఉన్న కేసీఆర్ ఇంట్లో నాలుగు పదవులు ఉన్నాయన్నారు. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరుకు నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com