గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం భారీగా భక్తులు తరలి రానుండడంతో గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
బషీరాబాగ్ - కాచిగూడ, బషీర్బాగ్-రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్-దిల్సుఖ్నగనర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్-ఎల్బీనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ - వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.
ఉప్పల్- ఇందిరాపార్కు, మల్కాజిగిరి-ఇందిరాపార్కు, ఇందిరాపార్కు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
లక్డీకాపూల్-టోలీచౌకి, ఖైరతాబాద్-బీహెచ్ఈఎల్, లకిడికాఫూల్-కొండాపూర్, యూసుఫ్గూడ, రాజేంద్రనగర్ రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఆల్ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, బోరబండ, బాచుపల్లి, లింగంపల్లి, పటాన్చెరు. తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.