సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహదూర్పురాకు చెందిన అబ్దుల్ ఖయ్యూం, మహ్మద్ అజాద్, ఆసిఫ్ నగర్కు చెందిన మహ్మద్ తల్ల ఆటో డ్రైవర్లు. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఆటోల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్ఫోన్లు చోరీ చేస్తున్నారు. అయితే, ఇటీవల తిరుమలగిరిలో ఓ వ్యక్తి సెల్ఫోన్ను కార్ఖానా ప్రాంతంలో దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 1.08 లక్షల విలువ చేసే ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురిని రిమాండుకు తరలించారు.